Flipkart Sale: మంచి డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తోన్న కస్టమర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే సేల్ ప్రకటించింది. ‘రిపబ్లిక్ డే సేల్’ పేరుతో ఓ సేల్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ జనవరి 14 నుంచి 19 వరకు మొత్తం ఆరు రోజులు పాటు కొనసాగనుంది. కాగా ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే అంటే జనవరి 13 అర్థరాత్రి నుంచే ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ముందుగా మోటోరోలా ఎడ్జ్ 40 నియో, గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ ఎస్21 ఎఫ్ఈ 5జీ, రియల్ మీ 11ఎక్స్ 5జీ, శాంసంగ్ ఎఫ్14 5జీ, మోటో జీ54 5జీ, రియల్మీ సీ 53 స్మార్ట్ఫోన్తో సహా మరికొన్ని ఫోన్లపై భారీ తగ్గింపు ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కొత్తగా విడుదల కానున్న ఫోన్లపై కూడా రాయితీ అందించనున్నట్లు సమచారం. అలాగే ఫ్యాషన్ యాక్సెసరీస్పై 50-80 శాతం, అప్లయెన్సస్పై 75శాతం వరకు ఆఫర్లు ఉండనున్నాయి. బ్యూటీ, ఫుడ్, టాయ్స్పై 85 శాతం, ఫర్నిచర్లపై 80 శాతం వరకు అదిరిపోయే డిస్కౌంట్లు పొందొచ్చు. దీంతోపాటు పలు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.