EPAPER

Mental Health: మానసిక ఆరోగ్యం కోసం నిపుణుల సలహాలు..

Mental Health: మానసిక ఆరోగ్యం కోసం నిపుణుల సలహాలు..

Mental Health: శారీరిక ఆరోగ్యం అనేది ఒక మనిషి జీవనానికి ఎంత ముఖ్యమో.. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఈమధ్యకాలంలో పెరిగిన టెక్నాలజీతో శారీరిక ఆరోగ్యాన్ని సైతం కనిపెడుతూ ఉండవచ్చు కానీ మానసిక ఆరోగ్యాన్ని కనిపెడుతూ ఉండడం మాత్రం కష్టమయిపోయింది. అందుకే వైద్యులతో పాటు పలువురు మానసిక వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు సైతం మానసిక ఆరోగ్యం కోసం రకరకాల సూచనలను అందిస్తూ ఉంటారు.


మనిషి టీనేజ్ నుండి యవ్వనానికి మారుతున్న క్రమంలో మెదడుపై ఎంతో ఒత్తిడి పడుతుంది. ఆరోగ్యం, సంబంధాలు, కుటుంబం, ఉద్యోగం, సంపాదన.. ఇలా ఎన్నో ఆలోచనలు ఒకేసారి తన మెదడును కమ్మేస్తాయి. అయితే మనిషి మెదడు గురించి స్పష్టంగా తెలుసుకోవడం కోసం 5 వేల ఏళ్ల క్రితమే పతాంజలి యోగసూత్రములు అనే పుస్తకం రచించబడింది. అందుకే మనిషి మెదడులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అయిదు భాగాల గురించి చెప్పబడింది. అవే ప్రమాణ్, విప్రయాయ్, వికల్ప, నిద్ర, స్మృతి.

మనిషి జీవనం సాఫీగా కొనసాగాలంటే ఈ అయిదు వృత్తులు సక్రమంగా సాగాలని ఆ సూత్రాలలో ఉంది. ఈ అయిదు సూత్రాలలో ఏ ఒక్కటి కూడా సరిగా జరగకపోయినా.. మనిషి బాధలో మునిగిపోతాడని యోగసూత్రములు చెప్తున్నాయి. అయితే మనిషి మానసిక ఆరోగ్యంలో భాగంగా సేవాగుణం అనేది ముఖ్యమని, సేవాగుణం ఉన్నవారి మానసిక ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుందని తెలిపాయి. నలుగురితో కలిసిపోడం, నలుగురితో పంచుకోవడం లాంటి గుణాలు ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు సైతం నిర్ధారించారు.


ప్రస్తుత రోజుల్లో నేను అనే స్వార్థం మనుషుల్లో ఎక్కువయిపోయిందని, అలా కాకుండా నలుగురి గురించి ఆలోచిస్తే మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. అంతే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, స్మార్ట్ ఫోన్స్ మధ్య బ్రతుకుతున్న ఈ కాలంలో స్వార్థం అనేది మరింత పెరిగిపోయిందని వారు తెలిపారు. మెదడులో ఆలోచనా శక్తి తగ్గిపోయి, కంప్యూటర్ వైర్లపై ఆధారపడే జీవితాలను జీవిస్తున్నామని వాపోతున్నారు. మొత్తంగా మనుషుల్లో హ్యామన్ ఫ్యాక్టర్ అనేది పోయిందని నిపుణులు బయటపెట్టారు.

ఒకప్పటితో పోలిస్తే.. మనుషుల్లో పెరిగిన స్వార్థం కారణంగానే క్రిమినల్ యాక్టివిటీ అనేది విపరీతంగా పెరిగిపోయిందని స్టడీలో తేలిందని నిపుణులు విమర్శిస్తున్నారు. మరికొందరిలో డిప్రెషన్, ఆందోళన లాంటివి పెరిగిపోయాయని చెప్తున్నారు. మనిషి ఏ పని చేయాలన్నా ముందుగా మెదడే సంకేతాలు పంపిస్తుంది కాబట్టి ఆ మెదడును ఆరోగ్యంగా పెట్టుకోవడం అనేది ఎంతైనా ముఖ్యమని నిపుణుల వాదన. యోగా లాంటివి చేయడం వల్ల మెదడు అనేది మనిషి కంట్రోల్‌లో ఉంటుందని వారు సలహా ఇస్తున్నారు.

Tags

Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

×