Amarnath Shivling : హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం ‘అమర్నాథ్ గుహ’. జమ్మూ, కాశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో ఉన్న ఒక పవిత్ర గుహ. ఇక్కడ శివుడు మంచు లింగం రూపంలో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు. వేసవిలో కొన్ని రోజులు మినహా ఏడాది పొడవునా ఈ గుహ మంచుతో కప్పబడి ఉంటుంది. మరి మంచు శివలింగం విశేషాలేంటో చూసేద్దామా!
పురాణం ప్రకారం.. ఓసారి పార్వతీ దేవి తన అమరత్వానికి గల కారణం గురించి శివుడిని అడిగితే.. కథ చెప్పడానికి అమర్నాథ్ గుహను ఎంచుకుంటాడు. ఆ తర్వాత పార్వతి సమేతంగాఅమర్నాథ్ గుహకు చేరుకుంటారు. ఆ అమర కథను మరెవరూ వినకుండా.. గుహ చుట్టూ ఉన్న ప్రతి జీవిని నాశనం చేయమని కాలాగ్నిని ఆదేశించాడు. ఆ తర్వాత శివుడు పార్వతికి అమరత్వం కథను చెప్పాడు. అయితే, ఒక జంట పావురాలు కూడా ఈ కథను విని అమరత్వం పొందాయట.
ఈ పవిత్ర గుహలో మంచుతో సహజ సిద్ధంగా ఏర్పడిన లింగంలో శివపార్వతులు నేటికీ దర్శనమిస్తున్నారు. ఈ పవిత్ర గుహ అమర్నాథ్ పర్వతంపై 17 వేల ఎత్తులో ఉంది. కాశ్మీర్లోని శ్రీనగర్కు 141 కి.మీ. దూరంలో ఉంది. ఆధునిక పరిశోధకుల ప్రకారం.. అమర్నాథ్ గుహను 1850లో బూటా మాలిక్ అనే ముస్లిం గొర్రెల కాపరి కనుగొన్నాడు. 1898లో స్వామి వివేకానంద అమర్నాథ్ గుహను సందర్శించినట్లు ‘నోట్స్ ఆఫ్ సమ్ వండరింగ్ విత్ స్వామి వివేకానంద’లో సోదరి నివేదిత పేర్కొన్నారు.