అందరికీ విద్యుత్తు సమానంగా అందిండంపై ఇప్పటివరకు ఎనర్జీ సంస్థలు విజయం సాధించాయి. కానీ త్వరలోనే విద్యుత్తు విషయంలో మార్పులు రావచ్చని శాస్త్రవేత్తలు అప్పుడే గుర్తించారు. అందుకే విద్యుత్తుపై కూడా అనేక పరిశోధనలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఎనర్జీని స్టోర్ చేయడానికి ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు.
పలు రీసర్చ్ సెంటర్లలోని శాస్త్రవేత్తలంతా కలిసి పాలిమెరిక్ ఎలక్ట్రోక్రామిక్ స్మార్ట్ విండోను తయారు చేశారు. ఇది ఎనర్జీని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ట్రెడిషినల్ స్మార్ట్ విండోస్ ఎనర్జీని స్టోర్ చేయడానికి ఉపయోగపడినా.. దానకంటే ఇది మెరుగ్గా పనిచేస్తుందని ఓ ప్రకటనలో అన్నారు.
ఇండియం ఆక్సైడ్ వంటి వాటితో తయారు చేసిన ట్రెడిషినల్ విండోస్ కంటే ఎలక్ట్రోక్రామిక్ ద్వారా తయారు చేసిన విండోస్ పవర్ మేనేజ్మెంట్కు ఎక్కువగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ స్మార్ట్ విండో ద్వారా తయారు చేసిన పరికరం డిగ్రేడేషన్ లేకుండా ఛార్జింగ్, డిస్చార్జింగ్ చేస్తూ ఎనర్జీని స్టోర్ చేస్తుందని వారు తెలిపారు.
స్మార్ట్ విండో డార్క్ స్టేట్లో ఉంటే అది ఛార్జింగ్ అవుతుందని అర్థం. అలా కాకుండా అది బ్లీచ్లాగా ఉంటే డిస్చార్జింగ్ చేస్తుందని అర్థం. ఇది రంగులు మారుస్తూ ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ అవుతుందా లేదా డిస్చార్జింగ్ అవుతుందా అన్నది సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. రంగులు మార్చే పాలిమర్లను పరిశోధనలో ఉపయోగించడమే దీనికి కారణం.
Follow this link for more updates:- Bigtv