Hindu Sacred Thread:దేవాలయానికి మరో చోటకు వెళ్తే ఎవరైనా గురువు గారు చేతికి పసుపు దారం కడితే కొంతమంది వెంటేనే తీసేస్తుంటారు. పసుపు దారం ఉంటే ఆహార పదార్దాల తీసుకునే విషయంలో నియమాలు పాటించాలని భయంతో వద్దంటారు. కాని పసుపు దారం రక్షకు కట్టిన దారంగానే భావించాలి. అన్ని వేళ్లలా పసుపుదారాన్ని చేతికి ధరించ ఉంచవచ్చని పండితులు చెబుతున్నారు. కొంతమందికి అన్నీ ఉన్నా లోపల ఏదో అసంతృప్తి . అలాంటి వారు తెల్లదారాన్ని కట్టుకుంటే మంచిది. ఎప్పుడైనా తెలుపును కళ్లు ఆకర్షిస్తూ ఉంటాయి. అదే పనిగా మనం తెలుపు రంగు చూడటం వల్ల ఏకాగత్ర పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది.
కోరికలు త్వరగా నెరవేరడానికి పసుపు దారం కట్టుకోవాలని పరిహారశాస్త్రం చెబుతోంది. శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం రోజు . పౌర్ణమి ముందు వచ్చే రోజు మూర సైజులో తెల్ల నూలు దారం తీసుకుని పసుపు రాయాలి. ఆ దారానికి ఏడు చోట్ల ముళ్లు వేసి గణపతి ఫోటో దగ్గర ఉంచాలి. కొబ్బరి నూనెతో దీపాన్ని ఐదు ఒత్తులు విడివిడిగా వేసి వెలిగించి గణపతి దగ్గర గరిక ఉంచాలి. బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఎర్రటి పూలతో ఉంచి ఓం గం గణపతయేనమః అంటూ 21 సార్లు మంత్రం జపించి పూజ చేయాలి. హారతి వెలిగించి పూజ అయిన తర్వాత పొట్టం కట్టి ఆ ధారాన్ని పర్సులో పెట్టుకోవాలి. అలా చేస్తే మనం కోరుకున్న కోరిక , సమస్య పరిష్కారం అవుతుంది. భక్తితో నమ్మకంతోనే ఇది చేసినప్పుడే నెరవేరుతుంది.
పసుపు దారం కట్టుకుంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. వైజ్ఞానికంగా చెప్పాలంటే చేతికి దారం ఉంటే త్వరగా హార్ట్ ఎటాక్ లు లాంటివి రావు. బ్రెయిన్ లో రక్త గట్టడం, కుడి చేతి వైపు గుంజినట్టు లాగడం, నిస్సత్తువగా మారడం , పెరాలసిస్ వచ్చేలా కనిపిస్తుంటాయంటే అలాంటి వాళ్లు చేతికి టైట్ గా దారం కట్టుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. బాగా చల్లదనం వల్ల కూడా కొంతమందికి పెరాలలిస్ లక్షణాలు బయటపడుతుంటాయి.అలాంటి వాటి నుంచి బయటపడటానికి కంకణం సహాయకారిగా ఉంటుంది. అందుకే చేతికి దారం శ్రేష్టమైంది. వైజ్ఞానికంగా నిరూపితమైంది. ఇలాంటివన్నీ ఆలోచించే మన పెద్దవాళ్లు వ్రతాలు అప్పడు ఇతర శుభకార్యాలయాల సమయాలోను కంకణం కట్టే పద్దతిని ప్రవేశపెట్టారు. ఈ దారాలు కంకణాలు మానసికంగాను ప్రభావం చూపిస్తాయ. తెల్లదారం మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది.