Banana : ప్రతిరోజు మూడు అరటిపండ్లను తినడం వల్ల గుండెపోటుకు చెక్పెట్టవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు ఓ అధ్యయనంలో కూడా ఇది నిరూపితం అయింది. నిత్యం కేవలం మూడు అరటి పండ్లను తినడం వల్ల హార్ట్ ఎటాక్తో పాటు, గుండెజబ్బులు కూడా దరిచేరవని అంటున్నారు. ఉదయం అల్పాహారం సమయంలో ఒకటి, మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి, రాత్రి భోజనం చేసేప్పుడు మరొక అరటిపండు తింటే తీసుకుంటే శరీరంలో పొటాషియం స్థాయిలు సరిగ్గా ఉంటాయని చెబుతున్నారు. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయట. అంతేకాకుండా రక్త సరఫరా కూడా మెరుగు అవుతుందని అంటున్నారు. మరోవైపు మెదడు, రక్త సంబంధిత రోగాలను కూడా 21 శాతం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నట్స్, పాలు, చేపలను కూడా నిత్యం ఆహారంలో తీసుకుంటే కూడా గుండెపోటు, రక్తపోటు రావని అంటున్నారు. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను నిత్యం తీసుకుంటే గుండె జబ్బులు రావని తేల్చిచెబుతున్నారు.ఒకవేళ గుండెజబ్బులు వచ్చినా జాగ్రత్తగా ఉండేందుకు పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగని పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువ మోతాదులో తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.