Tambulam : తమలపాకు తొడిమ తింటే రోగులు రావడానికి అవకాశం ఎక్కువ. అలాగే చివర్లు తింటే పాపం. ఆకులో ఉండే ఈనెలు తింటే బుద్ధి మందగిస్తుంది. తమలపాకు నమలగానే ఊసేయాలి. కారణం తొడిమ, ఈనెలు, చివర్లు ఇంకా మిగిలి ఉంటాయి. తొలి రసం ద్వారా బయటికి వదిలేయటం జరుగుతుంది. తాంబూలంలో ఒక ఒక్క మాత్రమే వాడాలి.
రెండు వక్కలు పనికిరావు. తాంబూలం గాయాలతో ఉన్నవారు, కంటి జబ్బులున్నవారు, వేసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆకుకి రాసే సున్నం మధ్యవేలు లేదా బొటన వేలితోనే రాయాలి. . దానివల్ల ఆయుష్షు పెరుగుతుంది. ఈ రెండు వేళ్ల ద్వారా సున్నం రాసినప్పుడు హృదయ నరాల్లో ఉత్తేజం కలిగి హృదయం తన పని తను మరింత సులువుగా చేసుకుంటుంది.
తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తొడిమ తొలగించి తినాలి చెప్పారు. రోజుకు 5 నుంచి 10 తమలపాకులను 2 ఏళ్లపాటు తింటే, డ్రగ్స్ మాదిరిగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. అలాగే అధిక రక్తపోటు గల వ్యక్తులు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు. తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనిని మితంగా వాడుకోవాలి.
సున్నం, వక్క తమలపాకు, ఈ మూడూ మంచి జోడీ. సున్నం ఎముకలు గుల్లబారటాన్ని నిలువరిస్తుంది. తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను అంతర్గత అవయవాల్లోకి చేరిస్తే, వక్క లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి జీర్ణక్రియకు సహాయపడుతుంది.