Kartika Masam : కార్తీక మాసంలో శివ, కేశవులకి ప్రతీపాత్రమైంది. ఈ కార్తిక మాసంలోనే శ్రీకృష్ణుడు చూపిన గోవర్ధన లీల మరో అపురూప ఘట్టం జరిగింది. మథురకు సమీపంలో ఉన్న గోవర్ధన గిరి హిందువులకు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రము.ఒక పురాణం ప్రకారం ఈ గోవర్ధన గిరి కృష్ణుడు యొక్క దైవలీలలో భాగంగా స్వర్గం నుండి భూమి మీదకు వచ్చిందని నమ్ముతారు. ఈ ప్రదేశముతో కృష్ణుడుకి సంబంధం ఉందని నమ్ముతారు.
మరొక పురాణం ప్రకారం ద్వాపర యుగంలో రాక్షస మాయ కారణంగా తుఫాన్ తో భారీ వర్షాలు కురిసి గోకులమంతా అతలాకుతలమైంది. కుండపోత వర్షాలు పడుతున్న సమయంలో కృష్ణుడు పర్వతాన్ని గోపాలుడు తన ఎడమచేతి చిటికెన వేలితో ఎత్తి వరుసగా ఏడు రోజుల పాటు పట్టుకోవడం ద్వారా ప్రజలను కాపాడాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గోవర్ధన గిరి హిందువులకు ప్రధాన యాత్రా ప్రదేశాలలో ఒకటిగా మారింది. అంతే కాకుండా గోవర్ధన గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే వారు కోరుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మకం.
ఈ పవిత్ర కార్తిక మాసంలో దామోదర వ్రతం ఆచరించాలని అంతర్జాతీయ హరేకృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యుడు శ్రీల ప్రభుపాదులు సూచించారు. శ్రీకృష్ణుడిని దామోదర అష్టకంతో కీర్తిస్తూ నేతి దీపాన్ని సమర్పించాలి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరేరామ హరేరామ రామ రామ హరే హరే’ నామ మంత్రాన్ని జపిస్తూ కూడా దీపాన్ని సమర్పించవచ్చు. కార్తిక మాసంలో ఒక్క దీపాన్ని వెలిగించినా శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నుడు అవుతాడు.