Idol: హైదరాబాద్లోని ఓ జ్యువెలరీ షాపు.. 75 వేల వజ్రాలతో అనంత పద్మనాభస్వామి విగ్రహాన్ని తయారుచేసి గిన్నిస్బుక్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇప్పటికే 8 గిన్నిస్ రికార్డులను సాధించిన శివ్ నారాయణ్ జ్యువెలర్స్.. తాజాగా తొమ్మిదోసారి రికార్డు కొల్లగొట్టింది.
జ్యువెలరీ యాజమాన్యం తయారు చేసిన శ్రీ అనంత పద్మనాభస్వామి విగ్రహం 8 అంగుళాల ఎత్తు, 18 అంగుళాల పొడవుతో ఉంది. దాదాపు 2 నెలల పాటు 32 మంది స్వర్ణకారులు ప్రతిరోజూ 16 గంటలు పని చేసి చేతితో తయారు చేశారు. విగ్రహ తయారీలో 500 క్యారెట్ల బరువు ఉన్న 75 వేల వజ్రాలను ఉపయోగించారు.
2.8 కేజీల బంగారం, 75 వేల వజ్రాలతో అనంత పద్మనాభస్వామి విగ్రహాన్ని తయారుచేశారు. ఈ మాస్టర్ పీస్ను ఇప్పటికే ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో 2023లో అధికారికంగా విడుదల చేశారు. కేరళలోని తిరువనంతపురంలోని ప్రతిష్టాత్మక శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ప్రతిష్టించబడిన దివ్య విగ్రహం ప్రేరణతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.