2000 Notes: దేశంలో బ్యాకింగ్ వ్యవస్థను పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ పర్యవ్యేక్షిస్తుంటుంది. అయితే మోదీ సర్కార్ గతంలో డీమానిటైజేషన్ సమయంలో తీసుకొచ్చిన రూ.2000 నోట్లపై తాజాగా మరో కీలక ప్రకటన చేసింది.
2000 Notes: దేశంలో బ్యాకింగ్ వ్యవస్థను పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ పర్యవ్యేక్షిస్తుంటుంది. అయితే మోదీ సర్కార్ గతంలో డీమానిటైజేషన్ సమయంలో తీసుకొచ్చిన రూ.2000 నోట్లపై తాజాగా మరో కీలక ప్రకటన చేసింది.
2000 వేల నోట్ల రద్దు చేస్తున్నట్లు 19 మే 2023న రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. చలామణి నుంచి ఉపసంహరించుకున్న తర్వాత ఇప్పటి వరకు దేశ ఆర్థిక వ్యవస్థలోని రూ. 2000 నోట్లలో 97.83 శాతం నోట్లను బ్యాంకుల నుంచి వెనక్కి రప్పించింది. కానీ ఇంకా రూ.9 వేల 330 కోట్లు విలువైన కరెన్సీ నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు పేర్కొంది. ఆయా నోట్లను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవాలని తెలిపింది.
ప్రస్తుతం 2000 నోట్లకు చట్టబద్దత ఉన్నందున రాబేయే లోక్ సభ ఎన్నికల కోసం చాలా మంది ఓటర్లకు తమ వద్ద ఉన్న నోట్లను పంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రకటనతో మరెన్నో నోట్లు రిజర్వ్ బ్యాంక్కు చేరుకునే అవకాశం ఉంది.
రిజర్వ్ బ్యాంక్కు దేశ వ్యాప్తంగా 19 కార్యాలయాలు ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్, బేలాపూర్, చండీగడ్, భువనేశ్వర్, భోపాల్, గౌహతి, జైపూర్, కాన్పూర్, జమ్మూ, ముంబై, కోలకత్తా, లక్నో, న్యూడిల్లీ, నాగ్పూర్, తిరువంతం, పాట్నాలో నోట్లను మార్చుకోవచ్చు.