RRB NTPC Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8,113 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ద్వారా గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు.
ఆర్ఆర్బీ రీజియన్లు: సికింద్రాబాద్, అహ్మదాబాద్, తిరువనంతపురం, పట్నా, రాంచీ , జమ్మూ కశ్మీర్, గోరఖ్ పుర్, ముంబై, కలకత్తా, మాల్దా, గువహటి, చంఢీగడ్, చెన్నై, బిలాస్ పూర్, భువనేశ్వర్, భోపాల్, బెంగళూరు, అజ్ మేర్, సిలిగురి,
గ్రాడ్యుయేట్ పోస్టులు..
1. స్టేషన్ మాస్టర్: 994 పోస్టులు
2. గూడ్స్ రైల్ మేనేజర్: 3,144పోస్టులు
3. కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్: 1736పోస్టులు
4. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 1507పోస్టులు
5. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 732పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 8,113పోస్టులు
రీజియన్ల ప్రకారం:
సికింద్రాబాద్ – 478
బెంగళూరు- 496
చెన్నై- 436
భువనేశ్వర్- 758
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయో పరిమితి: 01.01.2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.
Also Read: గుడ్ న్యూస్.. రైల్వేలో 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్
జీతం: నెలకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్ / స్టేషన్ మాస్టర్ పోస్టులకు రూ. 35, 400 ఇతర పోస్టులకు రూ.29,200
దరఖాస్తు ఫీజు: రూ. 500 ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ ఎం, ఈబీసీ, దివ్యాంగులకు , మహిళా అభ్యర్థులకు రూ. 250
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 14. 09.2024
చివరి తేదీ: 13.10.2024