APSFC : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అసిస్టెంట్ మేనజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు
ఒప్పంద ప్రాతిపదికన పనిచేయాలి. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు సీఏ/ సీఎంఏ లేదా బీఈ, బీటెక్, పీజీడీఎం, డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
అభ్యర్థులు వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.35,000లు వేతనంగా చెల్లిస్తారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీలకు రూ.354, జనరల్/ బీసీలకు రూ.590గా నిర్ణయించారు. ఆన్లైన్ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ 30-06-2023. ఆన్లైన్ ఎగ్జామ్ జులైలో నిర్వహిస్తారు.
వెబ్సైట్ : ttps://esfc.ap.gov.in/Careers.jsp