CTET 2024 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ .. సీటెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం సీబీఎస్ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఏడాదిలో రెండు సార్లు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. తాజాగా డిసెంబర్- 2024 ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ అప్లికేషన్స్ సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభం అయ్యాయి. అభ్యర్థులు అక్టోబర్ 16 వరకు అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు..
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ – డిసెంబర్ 2024.
పరీక్ష విధానం: పరీక్షను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ఇందులో మొదటి పేపర్ 1-5, రెండవ పేపర్ 6-9 తరగతులకు బోధించే వారి కోసం నిర్వహిస్తారు. పరీక్షను మొత్తం 20 భాషల్లో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలకు అర్హత ఉంటుంది.
అర్హతలు: ఇంటర్, డిగ్రీ, డీఈఎల్ ఈడీ/డీఈడీ( స్పెషల్ ఎడ్యుకేషన్), స్పెషల్ బీఎడ్, బీఈఎల్ ఈడీ, బీఎస్సీఈడీ, బీఏఈడీ,బీఎస్సీఈడీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
Also Read: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు
అప్లై చేసుకోవడానికి ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 500 ,
పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, వరంగల్
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం:17.09.2024.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16.10.2024.