Jobs: ప్రభుత్వ ఉద్యోగాలు కరువైన ఈ సమయంలో.. ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా జాబ్ నోటిఫికేషన్స్ పడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC లిమిటెడ్లో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఏప్రిల్ 21 లాస్ట్ డేట్. మొత్తం 66 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అన్నీ పర్మినెంట్ కేటగిరీనే.
–ఎలక్ట్రికల్ ఎరెక్షన్ విభాగంలో 12 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
–మెకానికల్ ఎరెక్షన్లో 30
–సివిల్ కన్స్ట్రక్షన్లో 24 ఖాళీలు
–బీఈ/ బీటెక్ చదివిన వారు అర్హులు
–ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి
–అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లకు మించరాదు
–జీత భత్యాలు నెలకు రూ.60000 నుంచి రూ.180000 వరకు
–స్క్రీనింగ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
–జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు రూ.300
–ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు