USA: ఆర్ట్ వర్క్ ప్రదర్శనల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అరుదైన వస్తువులు, కళారూపాలు, పెయింటింగ్స్ ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. అనేక దేశాల్లో ఈ ప్రదర్శనలు జరుగుతుంటాయి. అరుదైన కళాఖండాలను చూడాలంటే ఈ ప్రదర్శనకు వెళ్లాల్సిందే. ఇక ఇటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా ‘ఇక్కడ కళాఖండాలను తాకొద్దు’ అనే బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ చాలా మంది బోర్డు చూసినా కూడా కావాలనే వాటిని తాకుతుంటారు.
ఇటీవల అమెరికాలోని మియామిలో వీఐపీ ప్రివ్యూ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ పాప్ కళాకారుడు జెఫ్ రూపొందించిన బెలూన్ డాగ్ సిరీస్లోని నీలం రంగు బొమ్మను ప్రదర్శనకు ఉంచారు. దాని విలువ రూ. 42 వేల డాలర్లు. అంటే మన డబ్బుల్లో అక్షరాల రూ.43 లక్షలు.
ఇక అసలు విషయానికొస్తే.. ఆ కార్యక్రమానికి వచ్చిన ఓ వృద్దురాలు బెలూన్ డాగ్ను చూసి ఆశ్చర్యపోయింది. దాన్ని తట్టి చూసింది. దీంతో క్షణాల్లో ఆ బొమ్మ జారి కింద పడి పగిలిపోయింది. ఏం జరుగుతుందో తెలియక వృద్ధురాలు ఒక్కసారిగా షాక్ అయిపోయింది.
ఈ ఘటనపై స్పందించిన నిర్వాహకులు.. వృద్ధురాలు కావాలని బొమ్మను తాకలేదని.. అనుకోకుండా జరిగిందన్నారు. బొమ్మకు బీమా ఉండటంతో నష్ట పరిహారం లభిస్తుందని వెల్లడించారు. బొమ్మను ధ్వంసం చేసిన వృద్ధురాలి పేరును మాత్రం సీక్రెట్గా ఉంచారు.