US earthquake latest news(International news in telugu): అమెరికాలో మరోసారి భూమి కంపించింది. లాస్ఏంజిల్స్లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతగా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వెంటనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపంతో పలు ఇళ్లల్లోని అద్దాలు, సామాన్లు ధ్వంసమయ్యాయి.
స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం లాస్ఏంజిల్స్ ప్రాంతం నుంచి మెక్సికో సరిహద్దులోని శాన్డియాగో వరకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం వంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
కాగా, ఇటీవల న్యూజెర్సీలో రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో న్యూయార్క్ లోనూ ప్రకంపనలు తాకాయి. వైట్ హౌస్ స్టేషన్ కు 7 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 4.6 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. న్యూజెర్సీలో ఇలాంటి భూకంపాలు చాలా అరుదు అని యూఎస్ జీఎస్ పేర్కొంది.