Ukraine : దాదాపు రెండేళ్లుగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. యుద్ధ వాతావరణాల కారణంగా ఉక్రెయిన్ వాసులు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పిటిఎస్డి).. ఆంకాలజికల్ వ్యాధులతో బాధ పడుతున్నారు. ఆ వ్యాధులను నయం చేయడంలో సహాయపడటానికి మెడికల్ గంజాయి వాడుకను చట్టబద్ధం చేసేందుకు..ఉక్రెయిన్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని ఆమోదించింది.
ఉక్రెయిన్ లో మెడికల్ గంజాయిని చట్టబద్ధం చేసే ఈ చట్టానికి అనుకూలంగా 248 ఓట్లు, వ్యతిరేకంగా 16 ఓట్లు వేశారు. 33 మంది గైర్హాజరుయ్యారు.40 మంది సభ్యులు ఓటు వేయలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ జూన్ 2023లో దేశ పార్లమెంటులో చేసిన ప్రసంగంలో మాదకద్రవ్యాలను చట్టబద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కొన్ని నెలల వ్వవధిలోనే ఈ చట్టాన్ని ఆమోదించడం విశేషం.
గంజాయి మందులను ఉపయోగించే పరిస్థితులను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుందని పార్లమెంటు చైర్మన్ రస్లాన్ స్టెఫాన్చుక్ చెప్పారు. బిల్లు తుది వెర్షన్ ప్రకారం, ఈ చట్టం “వైద్య, పారిశ్రామిక ప్రయోజనాలు, శాస్త్రీయ-సాంకేతిక కార్యకలాపాల కోసం జనపనార మొక్కల (గంజాయి) ప్రసరణను నియంత్రిస్తుంది, యుద్ధం ఫలితంగా ఆంకాలజికల్ వ్యాధులు.. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్ కు అవసరమైన చికిత్సకు.. రోగి ప్రాప్యతను విస్తరించడానికి పరిస్థితులను సృష్టిస్తుంది.”
“ప్రపంచంలోని అన్ని ఉత్తమ పద్ధతులు, అన్ని ప్రభావవంతమైన విధానాలు, అన్ని పరిష్కారాలు, అవి మనకు ఎంత కష్టంగా లేదా అసాధారణంగా అనిపించినప్పటికీ, ఉక్రెయిన్కు వర్తింపజేయాలి, తద్వారా ఉక్రేనియన్లు, మొత్తం పౌరులు, యుద్ధం వలన ఒత్తిడి, గాయాన్ని భరించాల్సిన అవసరం లేదు,” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు అంతకు ముందు తెలిపారు.
రష్యా 2022 ఫిబ్రవరి 24 న ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించింది. ఏదేమైనా, ఇటీవల యుద్ధ సంబంధిత పరిస్థితుల నుంచి ఉపశమనం పొందేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.