Earthquake: భూకంపం దెబ్బకు టర్కీ, సిరియా దేశాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. బహుల అంతస్థుల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకొని దాదాపు 46 వేల మంది దుర్మరణం చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. 12 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు భయటపడుతున్నాయి.
అయితే ప్రమాదం సంభవించి 296 గంటలు గడవడంతో.. శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో టర్కీలో సహాయక చర్యలను ఈరోజుతో నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ అధిపతి యూనస్ సెజర్ వెల్లడించారు.
ఇక ఇప్పటి వరకు భూకంపం దెబ్బకు మూడు లక్షలకు పైగా ఇళ్లు, అపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అంటు రోగాల వ్యాప్తి క్రమంగా పెరుగతోంది.