Turkey: గాజా, ఇజ్రాయిల్ పరస్పర దాడులు కొన్ని నెలలుగా కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ .. గాజాపై ఇజ్రాయిల్ దాడులను తీవ్రంగా ఖండించారు. అంతే కాకుండా గాజా ప్రజలకు సాయం చేసేందుకు ఇజ్రాయిల్లోకి ప్రవేశిస్తామని తెలిపారు. ఇదే సమయంలో దాడును వెంటనే నిలిపివేయాలని కూడా హెచ్చరించారు.
ఇదిలా ఉంటే తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా పాల్లొన్న ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే ఎర్డోగాన్, గాజాపై ఇజ్రాయిల్ దాడులను ఖండించారు. పాలస్తీనా ప్రజలకు టర్కీ అండగా ఉటుందని తెలిపారు. అలాగే టర్కీ గతంలో లిబియా నాగోర్నో – కారాబాఖ్లలో ప్రవేశించి నట్లుగా ఇజ్రాయిల్లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇజ్రాయిల్లోకి వెళ్తే కనుక వారి సైన్యంపై తీవ్రమైన దాడులు జరుగుతాయి అని అన్నారు. మరో వైపు ఎర్డోగాన్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఇజ్రాయల్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు.