Trans Lines: రానున్న 17 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ కిలోమీటర్ల మేర విద్యుత్తు సరఫరా లైన్లు వేయాల్సిన అవసరం ఉంది. డిమాండ్ను తట్టుకునేందుకు ట్రాన్సిమిషన్ లైన్లను విస్తృతం చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) తాజాగా నివేదించింది.
ఇంధన వినియోగంలో ఇప్పటికీ చమురే అగ్రస్థానంలో ఉంది. 2000-22 మధ్య విద్యుత్తు వినియోగం 16 శాతం నుంచి 21 శాతానికి మాత్రమే పెరిగింది. ఈ పెరుగుదల కూడా జనాభా విస్ఫోటం, పర్యావరణ లక్ష్యాల కారణంగానే. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్తు డిమాండ్ ఏటా 2.1% చొప్పున పెరుగుతోంది.
వర్థమాన దేశాల్లో డిమాండ్ 3.1% గా ఉంది. ఈ నేపథ్యంలో 2040 నాటికి విద్యుత్తు అవసరాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ డిమాండ్ను తట్టుకోవాలంటే కొత్త ట్రాన్సిమిషన్ లైన్లు అవసరం. అలాగే పాతవి తొలగించి కొత్త లైన్లు వేయాలని ఐఈఏ తెలిపింది.