Brazil: రోడ్డు ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. బ్రెజిల్ ఈశాన్య రాష్ట్రమైన బహియాలో తీరప్రాంత పర్యటన నుంచి టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీ కొన్న ప్రమాదంలో 25 మంది మరణించారు. మరో ఆరుగురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు.
బాహియాలో లోతట్టు ప్రాంతమైన నోవా ఫాతిమా – గవియావో నగరాల మధ్య ఫెడరల్ రహదారిపై రాత్రివేళ ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతున్నట్లు బహియా సివిల్ పోలీసులు వెల్లడించారు.