Sri Lanka Presidential Elections: ప్రస్తుతం అంతా శ్రీలంకవైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శనివారం అక్కడ తదుపరి అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే, ఆ పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపును కూడా ప్రారంభించారు. ఈ లెక్కింపు మరికొద్ది గంటల్లోనే పూర్తయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీలంక నూతన అధ్యక్షుడు ఎవరనేది ఈ ఫలితాలతో తేలిపోనున్నది.
కాగా, పోలైన ఓట్లలో మొదటగా పోస్టల్ ఓట్లను లెక్కించారు. ఆ తరువాత సాధారణ ఓట్లను లెక్కిస్తున్నారు. దాదాపు ఓట్ల లెక్కింపు ముగిసినట్లుగా తెలుస్తోంది. ఇంకొన్ని గంటల్లో విజయం ఎవరిదనేది తేలిపోనున్నది.
Also Read: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?
శనివారం రోజు మొత్తం 22 ఎలక్ట్రోరల్ జిల్లాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. పోలింగ్ అనంతరం ఆ దేశ ఎన్నికల కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ అత్యంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. శ్రీలంకలో రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సారి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. సమగి జన బలవేగయ పార్టీ నుంచి సజీత్ ప్రేమదాస, నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీకి చెందిన అనుర కుమార దిసనాయకేతోపాటు ప్రస్తుత అధ్యక్షుడు విక్రమ్ సింఘే.. ఈ ముగ్గురూ పోటీలో ఉన్నారు. త్రిముఖ పోరు నెలకొనడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. మరికొద్ది గంటల్లోనే శ్రీలంక అధ్యక్షుడు ఎవరనేది తేలిపోనున్నది.
Also Read: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!