Cheetah: భారత్లో చీతాలు అంతరించిపోయి దాదాపు పదేళ్లు అవుతోంది. అయితే వాటిని మళ్లీ పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో పోయిన ఏడాది నమీబియా నుంచి ఎనిమిది చీతాలను భారత్కు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ బర్త్ డే సందర్భంగా నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో వదిలారు. ఇప్పుడిప్పుడే ఆ చీతాలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిపోతున్నాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా చీతాలు కలిగిన దేశాల్లో ఒకటి దక్షిణాఫ్రికా. తాజాగా భారత్కు 100పైగా చీతాలను అందించేందుకు దక్షిణాఫ్రికా ముందుకొచ్చింది. రానున్న పదేళ్లలో 100కు పైగా చీతాలను అందించేలా దక్షిణాఫ్రికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి ఏటా 12 చీతాల చొప్పున రానున్న 8 నుంచి 10 ఏళ్లు పంపిచనుంది.
మొదటి విడుదతలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 చీతాలను భారత్కు పంపించనున్నట్లు దక్షిణాఫ్రికా ప్రకటించింది. ఈ చీతాలను కూడా మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో వదిలిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.