PM Narendra Modi in Russia for 16th Brics Summit: శాంతిస్థాపనకు భారత్ సిద్ధంగా ఉందని, ఇదే తమ దేశ విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బ్రిక్స్ శిఖరాగ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజాన్ నగరం వెళ్లిన ప్రధాన మంత్రి మోదీ.. అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించారు.
వివాదాలకు శాంతియుత పరిష్కారాలను భారత్ విశ్వసిస్తుందని చెప్పారు. అన్ని వివాదాలు చర్చలతో పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానమని చెప్పారు.ఉక్రెయిన్ వివాదానికి వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇస్తామని మోదీ పునరుద్ఘాటించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ అంశంపై గతంలోనూ ప్రస్తావించినట్లు గుర్తు చేశారు.
సమస్యలను శాంతి యుత విధానంలో పరిష్కరించుకోవాలని మేబు భావిస్తున్నామని, శాంతి, స్థిరత్వం స్థాపనకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. రాబోయే కాలంలో కూడా సాధ్యమైన అన్ని సహకారాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని మోదీ చెప్పారు.
Also Read: బుక్ ఫెయిర్లో కరువైన పుస్తక ప్రియులు.. అమ్ముడుపోయిన 35 పుస్తకాలు, 800 బిర్యానీలు!
కాగా, బ్రిక్స్ సదస్సుల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ప్రస్తుతం కజాన్ నగరంలో ఉన్నారు. గత మూడు నెలల వ్యవధిలో తాను రెండవసారి రష్యాలో పర్యటించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.