Inauguration of Hindu Temple in UAE by PM Narendra Modi : పశ్చిమాసియాలో తొలిసారిగా హిందూ ఆలయం నిర్మితమైంది. అబుధాబిలోని ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 14న ప్రారంభించనున్నారు. యూఏఈలో రెండు రోజుల పాటు ఆయన పర్యటిస్తున్నారు. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ(BAPS) ఈ మందిరాన్ని నిర్మించింది. ఇవీ ఆలయ విశేషాలు..
రూ.700 కోట్ల వ్యయంతో అబు మురేఖా ప్రాంతంలో 13.5 ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మితమైంది.
ఆలయానికి అవసరమైన భూమిని అబుధాబి యువరాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ డొనేట్ చేశారు. 2015లో మోదీ పర్యటన సందర్భంగా భూవిరాళం ప్రకటించారు.
2017లో మోదీ దీనికి భూమిపూజ చేశారు.
యూఏఈ ఎమిరేట్స్ను ప్రతిబింబిస్తూ ఆలయాన్ని ఏడు శిఖరాలతో నిర్మించారు.
ఆలయ ప్రాంగణం మొత్తం భారతీయ వాస్తు, శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడుతుంటుంది.
భూకంపాలకు చెక్ పెడుతూ ఫౌండేషన్లో వంద సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఇతర ప్రదేశాల్లోనూ ఇవి ఉన్నాయి.
అయోధ్య మందిరం తరహాలోనే ఈ ఆలయాన్ని కూడా ఉక్కు, సిమెంట్ లేకుండా నిర్మించడం విశేషం. ఇది పూర్తిగా రాతికట్టడ ఆలయం.