EPAPER

Pakistan: గోధుమ పిండికోసం తొక్కిసలాట.. పాక్‌లో 11 మంది దుర్మరణం

Pakistan: గోధుమ పిండికోసం తొక్కిసలాట.. పాక్‌లో 11 మంది దుర్మరణం

Pakistan: ఆర్థిక సంక్షోభంతో అల్లకల్లోలం అవుతుంది పాకిస్థాన్. తినడానికి తిండిలేక.. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి జనాలు అల్లాడిపోతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. ఈక్రమంలో అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా గోధమ పిండి పంపిణీ చేస్తండగా.. తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఆకలితో అలమటిస్తున్న జనాలకు ఉచితంగా గోధుమ పిండి పంపిణీ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో గోధుమ పిండి లోడ్‌తో కూడిన లారీని పంజాబ్ ప్రావిన్స్‌కు పంపించింది. అయితే జనాలు ఒక్కసారిగా ఆ లారీపైకి ఎగబడ్డారు. రన్నింగ్ ఉన్న లారీ ఎక్కి గోధుమ పిండి బస్తాలను తీసుకునేందుకు ప్రయత్నించారు.

ఈక్రమంలో తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్‌తో పాటు ముజఫర్‌గఢ్, ఒఖారా, జెహానియాన్, ఫైసలాబాద్ ప్రాంతాల్లో కూడా తొక్కిసలాట చోటుచేసుకుంది. గాయపడిని వారికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైలరవుతున్నాయి.


Tags

Related News

Elon Musk: ట్రంప్ ర్యాలీలో మస్క్ మామ డ్యాన్స్.. ఇలా తయారయ్యావేంటి సామి

Continent Turns Green: అక్కడ మొక్కలు మొలిచాయంటే.. భూమి అంతమైనట్లే, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది ఇదే!

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Dominica Citizenship: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా?

Trump Advice To Israel: ‘ఇరాన్ అణు స్థావారాలపై వెంటనే దాడి చేయండి’.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా

×