EPAPER

Papua New Guinea: పపువా న్యూ గినియాలో ఘోరం ..26మందిని నరికేశారు!

Papua New Guinea: పపువా న్యూ గినియాలో ఘోరం ..26మందిని నరికేశారు!

Genocide Papua New Guinea: పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలో దారుణం చోటుచేసుకుంది. జూలై 16 నుంచి 18 మధ్య మూడు గ్రామాలపై ఓ ముఠా ఒక్కసారిగా దాడి చేసిన సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ దాడిలో 26మంది మృతి చెందారు. దుండగులు వీరిని అతికిరాతంగా నరికి చంపేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు.


మూడు గ్రామాలపై ఓ ముఠా దాడి చేసి మృతదేహాలను చెల్లాచెదురుగా పడేశారు. ఇలా పడేయడంతో సమీపంలోని మొసళ్లు కొన్ని మృతదేహాలను సరస్సులోకి లాకెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. దాడి చేసే సమయంలో కొంతమంది పారిపోయారు. దుండగులు ఇళ్లను సైతం దహనం చేయడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తలదాచుకున్నారని అధికారులు చెబుతున్నారు.

భూములు, సరస్సుల యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదం నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×