EPAPER

Syed Mustafa Speech in Pak Parliament: భారత్ చంద్రుడిపైకి వెళ్లి చరిత్ర సృష్టిస్తే.. మనం మాత్రం.. పాక్ నేత స్పీచ్ వైరల్..!

Syed Mustafa Speech in Pak Parliament: భారత్ చంద్రుడిపైకి వెళ్లి చరిత్ర సృష్టిస్తే.. మనం మాత్రం.. పాక్ నేత స్పీచ్ వైరల్..!

Syed Mustafa Speech in Pakistan Parliament Gone Viral: పాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దుర్బరంగా మారింది. దీంతో అక్కడి నేతలే ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ సాధించిన విజయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే బుధవారం పాక్ ఏంపీ సయ్యద్ ముస్తఫా కమల్ భారత్ చంద్రయాన్-3 సహా విజయం సాధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఇందుకు సంబంంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


బుధవారం సయ్యద్ ముస్తఫా పార్లమెంట్ లో ప్రసంగిస్తూ..ప్రస్తుతం కరాచీలో పరిస్థితి ఎలా ఉందంటే భారత్ చంద్రుడిపైకి వెళుతుంటే కరాచీలో పిల్లలు మురికి కాలువలో పడి చనిపోతున్నారని అన్నారు. కరాచీలో తాగేందుకు స్వచ్ఛమైన నీరు దొరకని పరిస్థితి ఉందని చెప్పారు. 70 లక్షల మంది పిల్లలు స్కూళ్లకు దూరంగా ఉన్నారని వాపోయారు. పాకిస్థాన్ వ్యాప్తంగా 2.6 కోట్ల మంది చిన్నారులు స్కూళ్లకు దూరంగా ఉన్నారనే..నివేదికలను ఈ సందర్భంగా ఆయన వివరించారు.

దేశానికి కరాచీ ప్రధాన వనరు అని ముస్తఫా కమల్ అన్నారు. కానీ కరాచీలో చిన్నారులు కాలువలో పడి మరణించినట్లు వార్తలు వస్తుయని పేర్కొన్నారు. దేశంలో రెండు ఓడరేవులు ఉండగా.. ఆ రెండు కరాచీలోనే ఉన్నాయని చెప్పారు. కానీ కరాచీకి 15 ఏళ్లుగా పరిశుభ్రమైన మంచి నీరు అందడం లేదని తెలిపారు. కరాచీ సింధు ప్రావిన్స్ రాజధాని అని 48 వేల పాఠశాలలు స్థానికంగా ఉన్నాయని అన్నారు.


Also Read: ‘పీఓకే భారత్‌లో అంతర్భాగమే.. కొంతమంది బలహీనత వల్లే చేజారింది’

చదువుకోని పిల్లల వల్ల దేశ ఆర్థిక అభివృద్ధి నాశనం అవుతుందని వెల్లడించారు. అయితే ఈ సందర్భంగానే మౌలానా ఫజ్లుర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. భారత్, పాక్ కలిసి స్వాతంత్ర్యం పొందాయని కానీ.. భారత్ అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటే తాము మాత్రం కలలు కంటున్నామని అన్నారు. ఈ క్రమంలోనే ముస్తఫా కమల్ భారత్ పై ప్రశంసలు కురిపించారు.

Tags

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×