Prime Minister Modi: గత సంవత్సరం ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్ లో కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్(సీహెచ్ జీ) సమావేశాన్ని పాకిస్థాన్ నిర్వహించింది. ఈ సమావేశానికి భారత ప్రధాని మోదీతోపాటు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తోపాటు పలువురు దేశాధినేతలు హాజరైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది అక్టోబర్ లో కూడా సీహెచ్ జీ సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ సమావేశానికి కూడా రావాలంటూ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపింది. మోదీతోపాటు షాంఘై సహకార సంస్థకు చెందిన పలువురు నేతలను కూడా ఆహ్వానించింది.
Also Read: హెజ్బుల్లాపై భారీస్థాయిలో దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్.. అదే స్థాయిలో హెజ్బుల్లా రివర్స్ అటాక్
అయితే, పాకిస్థాన్ తో సమస్యాత్మక సంబంధాల నేపథ్యంలో ప్రధాని మోదీ అక్కడకు వెళ్లేందుకు సిద్ధంగా లేరని సంబంధిత వర్గాల సమాచారం. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ను ఆ సమావేశానికి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2015లో పాకిస్థాన్ లో చివరిసారిగా అప్పటి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పర్యటించారు. అయితే, ఇటీవలే జమ్మూలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో మన విదేశాంగ శాఖ మంత్రి భద్రతపై నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Also Read: బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయం రక్షించేందుకు ముస్లింల పోరాటం.. పూజారి ఏమన్నారంటే
చైనా, రష్యా నేతృత్వంలోని సీహెచ్ డీలో భారత్, పాకిస్థాన్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇది ప్రాంతీయ భద్రత, మధ్య ఆసియా దేశాలతో సహకారం వంటి అంశాలను పర్యవేక్షిస్తున్నది. ప్రస్తుతం సీహెచ్ జీకి అధ్యక్షత వహిస్తున్న పాకిస్థాన్ అక్టోబర్ 15, 16 తేదీల్లో దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, ఈ సమావేశంలో నాయకులు స్వయంగా పాల్గొనలేని పరిస్థితుల్లో వర్చువల్ విధానం ఉంటుందా లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.