Pakistan Army Chief Illegal Wealth : ఓ వైపు పాకిస్థాన్ అప్పుల కుప్పగా మారి.. నిత్యావసరాల కోసం అర్రులు చాస్తున్న సమయంలో ఆ దేశ ఆర్మీ ఛీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ఆస్థులు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. కొద్ది రోజుల్లోనే ఆయన పదవి నుంచి దిగిపోతున్న సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతం ఇప్పుడు పాకిస్థాన్లోనే కాకుండా మొత్తం ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందుతోందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి కూడా దీనిపై సీరియస్ అయిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్లో ప్రముఖమైన ఫ్యాక్ట్ ఫోకస్ అనే సంస్థ బజ్వా ఆస్థులపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఓ ప్రముఖ జర్నలిస్ట్ బజ్వా ఆస్తులు ఎలా అమాంతం పెరిగాయో లెక్కలతో, ఆధారాలతో కథనాల్లో వివరించారు. ఆరేళ్లల్లో బజ్వా ఆస్తులు ఊహించనంత రెట్టింపయ్యాయని.. వాటి మొత్తం విలువ 12.7 బిలియన్ పాకిస్థానీ రూపాయలు ఉంటుందని కథనం వెలువరించారు.
ఆస్తులను అమాంతం పెంచుకున్న బజ్వా..లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్లో ప్రముఖ ప్లాజాలను, కమర్షియల్ ఎస్టేట్స్ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల పేరు మీద కళ్లుచెదిరే ఆస్థులను బినామీగా రిజిస్టర్ చేయించారని ఆరోపణ చేసింది ఫ్యాక్ట్ ఫోకస్ సంస్థ. 2015లో బజ్వా తన పేరుతో ఏ ఆస్థులు లేవని ప్రకటించింది. అయితే ఆ తరువాత సంవత్సం ఆమె ఆస్థుల విలువ రూ.220 కోట్లకు ఎలా చేరిందని ఫ్యాక్ట్ ఫోకస్ సంస్థ ప్రశ్నిస్తోంది. బజ్వా కుమారిడితో పెళ్లి సమయంలో ఏమీ లేని కోడలి ఆస్తి.. పెళ్లైన వారానికి రూ.127 కోట్లకు ఎలా పెరిగిందని కథనం ప్రచురించింది ఫ్యాక్ట్ ఫోకస్ సంస్థ. ఈ కథనం ఇంటర్నెట్లో వెలువడగానే..సదరు వెబ్సైట్ను వెంటనే బ్యాన్ చేయించింది పాక్ ప్రభుత్వం.