Oil tanker capsizes in Oman 8 Indians among 9 rescued
ఒమన్ సముద్ర ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ప్రమాదంలో 16 మంది మృతి చెందినట్లుగా వార్తా కథనాలు వచ్చాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే భారత్ నావికా దళానికి చెందిన రెస్క్యూ టీమ్ రంగంలో దిగింది. సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. మునిగిన ఆయిల్ ట్యాంకర్ కింద చిక్కుకున్న 16 మందిలో 9 మంది సిబ్బందిని భారత నావికా దళం కాపాడింది. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రక్షించిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది భారతీయులు, ఓ శ్రీలంక జాతీయుడు ఉన్నారు. మునిగిపోయిన మరికొందరు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఒమన్ అధికారుల అనుమతి
ఒమన్ సముద్ర తీరంలో కొమెరోస్ జెండాతో 16 మంది సిబ్భందితో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన దుర్ఘటనలో 16 మంది మృతి చెందిన విషయాన్ని ధృవీకరిస్తూ ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటన జారీ చేసిన విషయం విదితమే. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులను రక్షించే విషయంలో ఒమన్ అధికారులతో భారత నావికా దళ అధికారులు చర్చలు జరిపి వారి అనుమతితోనే రెస్క్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు.