MuhammadYunus arrest : కార్మిక చట్టాల ఉల్లంఘన కేసులో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త మహ్మద్ యూనస్(83)ను బంగ్లాదేశ్ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అయితే ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అంటూ యూనస్ మద్దతుదారులు మండిపడుతున్నారు. తన మైక్రోఫైనాన్సింగ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మందిని దారిద్ర్యం నుంచి బయటపడేసిన ఘనత యూనస్ది. సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న షేక్ హసీనాతో శత్రుత్వం కారణంగా పేదల రక్తాన్ని తాగే వ్యక్తిగా ఆయనపై దుష్ప్రచారం సాగింది.
Muhammad Yunus : కార్మిక చట్టాల ఉల్లంఘన కేసులో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త మహ్మద్ యూనస్(83)ను బంగ్లాదేశ్ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అయితే ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అంటూ యూనస్ మద్దతుదారులు మండిపడుతున్నారు. తన మైక్రోఫైనాన్సింగ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మందిని దారిద్ర్యం నుంచి బయటపడేసిన ఘనత యూనస్ది. సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న షేక్ హసీనాతో శత్రుత్వం కారణంగా పేదల రక్తాన్ని తాగే వ్యక్తిగా ఆయనపై దుష్ప్రచారం సాగింది.
తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తూ యూనస్పై పలు అంతర్జాతీయ వేదికలపై హాసినా ఘాటైన విమర్శలు, ఆరోపణలు కూడా చేశారు. 2006లో నోబెల్ పురస్కారాన్ని పొందిన యూనస్ అనేక సంస్థలను స్థాపించారు. వాటిలో గ్రామీణ్ టెలికాం ఒకటి. ఆ కంపెనీలో ఉద్యోగుల సంక్షేమ నిధి ఏర్పాటుకు సంబంధించి యూనస్, మరో ముగ్గురు సహచరులు కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసులో ఢాకాలోని లేబర్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. కార్మికచట్టాల ఉల్లంఘన, అవినీతి తదితర ఆరోపణలకు సంబంధించి వందకు పైగా అభియోగాలను యూనస్ ఎదుర్కొంటున్నారు.