Governor: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ను నియమించారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్గా ఉన్న బిశ్వభూషన్ హరిచందన్ను ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమించారు.
అలాగే మహారాష్ట్ర గవర్నర్గా రమేష్, సిక్కిం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా త్రివిక్రమ్ పట్నాయక్, జార్ఖండ్ గవర్నర్గా రాధాకృష్ణన్, అస్సాం గవర్నర్గా గులాబ్చంద్ కటారియా, హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా శివప్రసాద్ శుక్లా, మణిపూర్ గవర్నర్గా అనసూయ, లడఖ్ లెఫ్టినెంట్ జనరల్గా బీడీ. మిశ్రా, నాగాలాండ్ గవర్నర్గా గణేషన్, మేఘాలయ గవర్నర్గా చౌహాన్, బీహార్ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నియమితులయ్యారు.