EPAPER

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాపై తాత్కాలిక ప్రభుత్వాధికారి మహమ్మద్ యూనస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరే వరకు ఆమె భారత్ లోనే మౌనంగా ఉండాలని తెలిపారు. అంతే కాకుండా ఆమె వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాలపై ప్రతికూలతలు చూపుతాయని అన్నారు. ఈ మేరకు రాజధాని ఢాకాలో తన అధికారిక నివాసంలో యూనస్ మీడియాతో మాట్లాడారు.


షేక్ హసీనా తిరిగి స్వదేశానికి పంపాలని బంగ్లాదేశ్ అడిగే వరకు ఆమె భారత్ లోనే ఉండిపోతే.. కనక మౌనంగా ఆమె ఉండాలని తెలిపారు. భారత్‌లో ఉండి మాట్లాడటం ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. హసీనా బంగ్లాదేశ్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తూ మాట్లాడటాన్ని ఎవరూ ఇష్టపడరని పేర్కొన్నారు.   బంగ్లాదేశ్ లోని దురాగతాల నుంచి ప్రజలకు న్యాయం అందించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉందని మహమ్మద్ యూనస్ తెలిపారు. న్యాయం జరగకపోతే తిరిగి వెనక్కి తీసుకువస్తామని అన్నారు. ఆమె పాల్పడిన దురాగతాలను అందరి ముందు విచారించాల్సిందేనని ద్వజమెత్తారు.

హిందువులపై దాడులు :


బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులు రాజకీయంగానే జరుగుతున్నాయని మహమ్మద్ యూనస్ అన్నారు. అందులో మతతత్వం కోణం లేదని తెలిపారు. అంతే కాకుండా భారత్ లో కూడా ఈ అంశాన్ని ఎక్కువ చేసి చూపించారని అసహనం వ్యక్తం చేశారు. హిందువులు రాజకీయంగా మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ కు మద్ధతు ఇచ్చారనే అభిప్రాయం ఉండటం వల్ల కొందరు వారిపై దాడులు చేశారని ఆయన తెలిపారు. అంతే కాకుండా ఇదే విషయాన్నిమోదీకి చెప్పినట్లు యూనస్ వెల్లడించారు.

Also Read: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

భారత్ సంబంధాల గురించి కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తాము భారత్ సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. హసీనా నాయకత్వంలోనే బంగ్లాదేశ్‌లో స్థిరత్వం ఉంటుందననే ధోరణిని భారత్ విడనాడాలనే వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఆశ్రయం పొందుతున్నహసీనా కొన్ని రోజుల క్రితం బంగ్లా పరిణామాలపై తొలిసారి స్పందించారు. తనకు న్యాయం కావాలని ఆమె డిమాండ్ చేశారు.

Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×