Hyderabad Girl Missing: ఇటీవల అమెరికాలో భారతీయులు క్షేమంగా ఉంటున్నారో లేదో అనే ఆందోళన మొదలైంది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే వారు ప్రాణాలు కోల్పోవడం, మిస్ అవ్వడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి.
ఇటీవల అగ్ర రాజ్యమైన అమెరికాలో హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థిని మిస్ అయిన విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. హైదరాబాద్ కు చెందిన కందుల నితిషా అనే యువతి మిస్సైనట్లు పలు వర్గాలు తెలిపాయి. మే 28వ తేదీన నితీషా మిస్ అయినట్లు సమాచారం. అయితే తాజాగా ఆమె ఆచూకీ లభ్యం అయినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు.
నితీషా కాలిఫోర్నియాలోని స్టేట్ యూనివర్సిటీలో శాన్ బెర్నార్డినోలో మాస్టర్స్ చేస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా నితీషా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులతో సహా స్నేహితులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా నితిషా ఆచూకీ లభ్యం కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది భారతీయులు తప్పిపోతున్నా కూడా రక్షణ లేకుండా పోతుందని భారతదేశంలోని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు సరైన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రాధేయ పడుతున్నారు. మరికొంత మంది విదేశాలకు పంపాలంటే 100 సార్లు ఆలోచించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఇప్పటికే గత నెలలో రూపేశ్ చంద్ర అనే ఓ భారతీయ విద్యార్థి కూడా షికాగోలో మిస్ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు హైదరాబాద్కు చెందిన మహ్మద్ అబ్దుల్ అర్పత్ అనే యువకుడు కూడా తప్పిపోయాడు. యూఎస్ పోలీసులు దర్యాప్తు చేయగా కొన్ని రోజులుగా అర్పత్ మృతదేహం లభ్యమైంది.