EPAPER

Missile Attack : భారత్‌కు చమురు తెస్తున్న నౌకపై మిసైల్ దాడి..

Missile Attack : భారత్‌కు చమురు తెస్తున్న నౌకపై మిసైల్ దాడి..
Missile Attack

India Oil Tanker Missile Attack : ఎర్రసముద్రంలో హౌతీల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇండియాకు చమురు తీసుకొస్తున్న నౌకపై క్షిపణి దాడి చేశారు. యెమెన్ భూభాగం నుంచే ఎంటీ పొల్యూక్స్ ఆయిల్ ట్యాంకర్‌పై మిసైల్ దాడి జరిగిందని యునైటెడ్ కింగ్డమ్ మ్యారీటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(UKMTO) ఏజెన్సీ తెలిపింది.


Read More: మలయ ద్వీపానికి కొత్త అధ్యక్షుడు..!

ఆ సమయంలో చమురు నౌక యెమెన్ తీరానికి 72 నాటికల్ మైళ్ల(133 కిలోమీటర్ల) దూరంలో ఉంది. ఈ దాడిలో నౌక స్వల్పంగా ధ్వంసమైంది. సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. దాడి జరిగిన ప్రాంతం నుంచి 3 నాటికల్ మైళ్ల దూరంలోనే ఉన్న మరో నౌకను మార్గం మళ్లించారు. ఈ నెల 28 నాటికి చమురు నౌక భారతదేశ తీరంలోని పరదీప్‌కు చేరాల్సి ఉంది. రోజుకు 3 లక్షల బారెళ్ల చమురును శుద్ధి చేయగల ఇండియన్ ఆయిల్ కంపెనీ రిఫైనరీ పరదీప్‌లో ఉంది.


Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×