North Korea: కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిమ్ జోంగ్ సహా సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధికారులు ఒక వేళ యుద్ధం జరిగితే అధినేత ఆదేశాలతో శత్రువులను అంతం చేస్తామని తెలిపారు. సైనికులు ఈ విధంగా స్పందించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటించింది.
దక్షిణ కొరియా, అమెరికా అణు యుద్ధానికి రెచ్చగొడుతున్నాయి. ఈ తరుణంలోనే అధ్యక్షుడు ఆదేశాలతో శత్రువుల వినాశనం కోసం అవసరమైన యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటామని సైనిక అధికారులు ప్రతిజ్జ చేశారు. దక్షిణ కొరియా యుద్ధానికి విరామం ఇస్తూ అమెరికా, చైనాలతో జులై 27, 1953 న ఉత్తర కొరియా ఓ తాత్కాలిక సంధి కుదుర్చుకుంది. జులై 27న విక్టరీ దినోత్సవం సందర్భంగా ఉత్తర కొరియా ఉత్సవాలు నిర్వహిస్తుండగా దక్షిణ కొరియా మాత్రం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించదు. అయితే, అది కేవలం తాత్కాలిక సంధిగానే పరిగణిస్తోంది.
Also Read: ‘గాజా యుద్ధం ముగించాల్సిందే..’ ఇజ్రాయెల్ ప్రధానితో కమలా హ్యారిస్
ఒప్పందం జరగకపోవడంతో ఇరు పక్షాలు ఇంకా యుద్ధంలో ఉన్నట్లే అని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు అమెరికా, ఉత్తర కొరియా మధ్య కొంత కాలంగా దౌత్య సంబంధాలు లేకపోవడంతో పాటు అణు నిరాయుధీకరణపై 2019 నుంచి చర్యలు కూడా నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా ఈ పరిణామంలో మార్పు ఉంటుందిని ఆశించడం లేదని ఉత్తర కొరియా పేర్కొంది.