Iran Warning: అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ఉచ్చులో పడవద్దని ఇరాన్ ప్రభుత్వం అమెరికాను హెచ్చరించింది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన చేసింది.
ఇటీవలే సిరియాలో ఉన్న ఇరాన్ కాన్సులేట్ పై ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయి. ఇజ్రాయెల్ జరిపిన ఆ దాడిలో పలువురు ఇరాన్ అధికారులు మృతి చెందారు. దీంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నారు. త్వరలోనే తాము ఇజ్రాయెల్ జరిగిపిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది.
తాము ఈ విషయంలో చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని.. అమెరికా జోక్యం అవసరం లేదని కోరింది. ఈ నేపథ్యంలో అమెరికా నెతాన్యూహ ఉచ్చులోపడవద్దని ఇరాన్ పొలిటికల్ అఫైర్స్ చీప్ జామ్ సిది ఓ ప్రకటన ద్వారా అమెరికాను వార్న్ చేశారు.
Also Read: Student Died in US : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. స్టూడెంట్స్ కు భద్రత కరువు ?
అయితే ఇరాన్ విడుదల చేసిన హెచ్చరికపై ఇప్పటివరకూ అమెరికా మాత్రం స్పందించలేదు. కానీ మిడిల్ ఈస్ట్ దాడి నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.