Indian Naval Couple Scaled Mt Kilimanjaro: భారతీయ నౌకాదళ జంట టాంజానియాలోని 19341 అడుగుల ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. టాంజానియాలోని ఈ పర్వతం ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరంగా ప్రసిద్ధి గాంచింది. ఈ జంటకు పర్వతారోహణ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు.
గురువారం ఈ ఘనత సాధించినందుకు భారత నావికాదళం.. సీఎండీ దివియా గౌతమ్, సీఎండీ గౌరవ్ గౌతమ్ (రిటైర్డ్)ల జంటను అభినందించింది. 19341 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం & ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం మౌంట్ కిలిమంజారోను విజయవంతంగా అధిరోహించినందుకు భారత నౌకాదళ జంట సర్గ్ సీఎండీ దివియా గౌతమ్ & సీఎండీ గౌరవ్ గౌతమ్ (రిటైర్డ్)లకు అభినందనలు తెలియజేస్తున్నట్లు నేవీ ప్రతినిధి తెలిపారు.
కాగా భారత నౌకాదళానికి చెందిన ఓ మహిళా అధికారి తొలిసారిగా ఈ ఘనత సాధించడం గమనార్హం.
Indian Naval couple successfully scale world's highest free-standing mountain Mt Kilimanjaro#MtKilimanjaro #IndianNavyhttps://t.co/IisApnuNO0
— IndiaTV English (@indiatv) June 13, 2024
కిలిమంజారో పర్వతం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
టాంజానియాలో ఉన్న కిలిమంజారో పర్వతం ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం, దీని పొడవు దాదాపు 5,895 మీటర్లు (19,340 అడుగులు). ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టాండింగ్ పర్వతం , అంటే ఇది వేరే ఏ ఇతర పర్వత శ్రేణిలో భాగం కాదు.
కిలిమంజారో ఒక అద్భుతమైన సహజ దృగ్విషయం. ఇది సవన్నాకు అభిముఖంగా చుట్టుపక్కల మైదానాల పైన ఒంటరిగా ఉంది. ఇక కిలిమంజారో పర్వతంలో మొత్తం మూడు అగ్నిపర్వతాలు ఉన్నాయి. అవి కిబో, మావెన్జీ, షిరా.