Israel: కాల్పుల మోతతో ఇజ్రాయెల్ మరోసారి దద్దరిల్లింది. జెరూసలేంలోని ఓ ప్రార్థనా మందిరంలో ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. శుక్రవారం సాయంత్రం 8.30 గంటల సమయంలో విచక్షణారహితంగా జనాలపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉగ్రవాదిపై కాల్పులు జరపడంతో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.