salt : కాస్తంత ఉప్పు తగిలితేనే కూరకు రుచి. వేల సంవత్సరాలుగా ఇది మన జీవితంలో భాగమైపోయింది. శరీరానికి కూడా లవణం అవసరమే. నరాలు, కండరాలు, జీర్ణకోశ వ్యవస్థకు అవసరమైన ఫ్లూయిడ్స్ను నియంత్రించేది సోడియం క్లోరైడే. ఉప్పు తయారీ ఎప్పుడు ఆరంభమైందో చెప్పడం కష్టమే.
కూరగాయల వాడకం పెరిగిన కొద్దీ ఆహారంలో సాల్ట్ అవసరం పెరిగింది. ఉప్పు తయారీలో మనది మూడోస్థానం. చైనా, అమెరికా తొలి రెండు స్థానాలు ఆక్రమించాయి. భారత్లో ఏటా 230 మిలియన్ టన్నులు సాల్ట్ తయారవుతోంది.
గత 60 ఏళ్లలో సాల్ట్ ఇండస్ట్రీ దేశంలో బాగా పెరిగింది. స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో దేశీయ అవసరాల కోసం బ్రిటన్, ఏడెన్ నుంచి ఉప్పు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం.
దేశంలో గుజరాత్లోనే అత్యధికంగా ఉప్పు తయారవుతోంది. మొత్తం ఉత్పత్తిలో 76 శాతం వాటా ఆ రాష్ట్రానిదే. తమిళనాడు 12%, రాజస్థాన్ 8% మేర సాల్ట్ను తయారు చేస్తున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తరువాతి స్థానాలను ఆక్రమించాయి.