International Kite Festival : రంగు రంగుల గాలిపటాలతో.. కన్నుల పండుగకు వేదికైంది అహ్మదాబాద్. గుజరాత్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రివర్ ఫ్రంట్ లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘రామ్’ థీమ్తో ఉన్న గాలిపటాన్ని సీఎం ఎగురవేశారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 12వ తేదీ వరకు జరగనున్న ఈ కైట్ ఫెస్టివల్ లో 55 దేశాల నుంచి 153 పతంగుల ఫైయర్లు గాలిపటాలు ఎగురవేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి సీఎం తో పాటు.. గవర్నర్ కూడా హాజరయ్యారు. అలానే పలువురు నేతలు కూడా పాల్గొని గాలిపటాలు ఎగురవేశారు. చేస్తున్న ఈ ఈవెంట్ కి గుజరాత్ లోని 23 నగరాల నుంచి 865 మంది కైట్ ఫ్లైయర్లు పాల్గొంటున్నారు. అలానే దేశ వ్యాప్తంగా ఉన్న 12 రాష్ట్రాల నుంచి 68 మంది పతంగులను ఎగురవేసేందుకు వచ్చారు. ఈ వేడుకను చూసేందుకు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుండడంతో.. వాతావరణం అహ్లాదకరంగా మారింది.