UK Visa : యూకే వీసా కోసం ఎదరుచూస్తున్న భారతీయులకు ఇదో పెద్ద శుభవార్త. భారత పౌరులకు అందించే వీసా ప్రక్రియలో మరింత వేగం పెంచినట్లు భారత్లో ఉన్న బ్రిటెన్ హైకమిషనర్ అధికారికంగా ప్రకటించారు. వీసా ప్రాససింగ్ కోసం తీసుకునే 15 రోజుల గడువు దాటిపోతోందని.. దీంతో వీసా ఆలస్యమవుతోందన్నారు. కరోనా వైరస్, ఉక్రెయిన్ యుద్ధం.. ఈ జాప్యానికి కారణం అని చెప్పింది బ్రిటెన్ హైకమిషనర్ ఆఫీస్.
బ్రిటెన్లో వీసా దాటిన తరువాత అక్కడ ఎక్కువగా నివసించేది భారతీయులే.. దానికి ప్రధాన కారణం బ్రిటెన్ మాత్రమే అని భారత్ వెళ్లడించింది. గత ఏడాది ఈ అంశంపై ఇరు దేశాల మద్య ఇప్పటికే చర్చ జరిగింది. వీసాలు అందించడంలో బ్రిటెన్ కావాలని జాప్యం చేస్తున్నట్లు భారత్ వాదించినా ఇప్పటి వరకు ఆశించిన ఫలితాలు రాలేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని బ్రిటిన్ హైకమిషనర్ అలెక్స్.. వీసా జారీలో వేగవంతం పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. బ్రిటన్ వీసా కావాలనుకునే వారు మూడు నెలల ముందే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించారు.