Five People Killed, Several Injured During Foot Ball Match: ఫుట్ బాల్ మ్యాచ్లో విషాదం చోటుచేసుకుంది. జమైకా దేశంలోని కింగ్స్టన్లో ప్లెజెంట్ హైట్స్ వేదికగా జరుగుతున్న పుట్ బాల్ మ్యాచ్లో ఒక్కసారిగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు మ్యాచ్ జరుగుతుండగా.. మైదానంలోకి ప్రవేశించి కాల్పులు చేశారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. కింగ్స్టన్ స్టేట్లో సోమవారం అర్ధరాత్రి కొంతమంది కలిసి పుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్ జరిగిన కాసేపటికే దుండగులు కాల్పులు చేశారు. వెంటనే పోలీసులు సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో రెండు రోజుల పాటు కర్ప్యూ విధించారు.
Also Read: మస్క్కు వ్యతిరేంగా బిల్ గేట్స్.. కమలా హ్యారిస్ ప్రచారానికి 50 మిలియన్ డాలర్ల విరాళం!
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పులకు గ్యాంగ్ వార్ కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు జమైకా కాన్ స్టాబులరీ ఫోర్స్ ఇన్ఫర్ మెషన్ డిపార్ట్ మెంట్ తెలిపింది. అయితే ఈ కాల్పులకు కారణమైన ఐదుగురిలో నలుగురిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.