EPAPER

Earthquake : ఇండోనేసియాలో భూకంప విషాదం..జావా ద్వీపం అతలాకుతలం

Earthquake : ఇండోనేసియాలో భూకంప విషాదం..జావా ద్వీపం అతలాకుతలం

Earthquake : ఇండోనేసియాలో సంభవించిన భూకంపంలో 162 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా అనేక మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. భూకంపం వల్ల 13 వేల మంది నిరాశ్రయులయ్యారు.


ఇండోనేసియాలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రధాన ద్వీపం జావాను సోమవారం భారీ భూకంపం అతలాకుతలం చేసింది. భూకంప కేంద్రం చియాంజుర్‌ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ ప్రాంతంలో ఇళ్లన్నీ కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇండోనేసియాలో చాలా మంది విద్యార్థులు సాధారణ తరగతులు ముగిసిన తర్వాత ఇస్లామిక్‌ పాఠశాలల్లో అదనపు తరగతులకు హాజరవుతారు. మృతిచెందిన వారిలో ఆ విద్యార్థులే అధికంగా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 700 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. చాలా మందికి ఆరుబయటే చికిత్స అందిస్తున్నారు. చియాంజుర్‌ పరిసరాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణనష్టం పెరిగింది.


జెడిల్‌ గ్రామంలో 25 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని రక్షించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.6గా నమోదైంది. దీని ప్రభావం చియాంజుర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని జకార్తాలోనూ కనిపించింది. అక్కడ అపార్టుమెంట్లు, కార్యాలయాలు కంపించాయి. ప్రజలు, ఉద్యోగులు ప్రాణభయంతో వీధుల్లో పరుగులు తీశారు.

ఇండోనేసియాలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. అయితే జకార్తాలో ప్రకంపనల ప్రభావం అంతగా కనిపించదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ సమత్రా ప్రావిన్సులో 6.2 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది జనవరిలో సులావేసిలో భూకంపం వల్ల 100 మంది మృత్యువాత పడ్డారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×