EPAPER

Earthquake: 24 వేలు దాటిన మరణాలు.. మూత్రం తాగి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు

Earthquake: 24 వేలు దాటిన మరణాలు.. మూత్రం తాగి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు

Earthquake: టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈప్రమాదంలో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు 24 వేల మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


శిథిలాలు కూలిపడి కొందరు మరణిస్తే.. మరికొందరు తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ఆకలితో అలమటిస్తూ.. తీవ్రమైన చలితో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మృతుల సంఖ్య 30వేలకు చేరుకునే అవకాశం ఉంది.

ఇక శిథిలాల కింద చిక్కుకున్న అద్నాన్ మహమ్మద్ కోర్కుట్ అనే 17 ఏళ్ల యువకుడు 101 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. ఆకలిని, దాహార్తిని తట్టుకోలేక మూత్రం తాగి ప్రాణాలను కాపాడుకున్నాని అద్నాన్ తెలిపాడు.


శిథిలాల కింద చిక్కుకున్న మరో విద్యార్థిని వాట్సాప్ రక్షించింది. ఓ అపార్ట్‌మెంట్ భవన శిథిలాల కింద చిక్కుకున్న 20 ఏళ్ల విద్యార్థి సమయ స్పూర్థితో.. వాట్పాప్‌లో తన స్నేహితులకు వీడియో సందేశంతో పాటు తాను ఉన్న లొకేషన్‌ను షేర్ చేశాడు. దీంతో స్నేహితులు సహాయక సిబ్బందికి సమాచారం అందించి… అతడిని సురక్షితంగా కాపాడారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×