China Yuan Wang : చైనా గూఢచార నౌక యువాన్ వాంగ్ 5 హిందూ మహాసముద్రం పరిధిలోకి ప్రవేశించింది. బంగాళాఖాతంలో దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించేందుకు భారత్ ప్రణాళికను ప్రకటించాక ఈ నౌక కనిపించడం కలకలం రేపుతోంది. చైనా బాలిస్టిక్ క్షిపణి, శాటిలైట్ ట్రాకింగ్ షిప్ కదలికలపై భారత నేవీ కన్నేసి ఉంచినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ క్షిపణి పరీక్ష నిర్వహిస్తుందా? లేదా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.