China Supports Al Qaeda : ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్కు చైనా మద్దతు తెలుపుతుందని అనేక ఆరోపణలు వచ్చాయి. తాజాగా చైనా దీన్ని నిజం చేస్తూ.. ఐరాసలో కీలక నిర్ణయం తీసుకుంది. లష్కరే తోయిబాలో ఉగ్రవాద సంస్థలో టాప్ లీడర్ షాహిద్ మహమూద్ను ఉగ్రవాదిగా ప్రకటించాలి అమెరికా భారత్ దేశాలు ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. ఈ మొహమ్మద్.. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నట్లు 2016లో అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆధారాలతో సహా కనుగ్గొంది. ఈ విషయాన్ని అప్పటి అమెరికా ఫారెన్ అసెట్ కంట్రోల్ అధికారి జాన్ ఇ స్మిత్ తెలిపారు.
గత 15 ఏళ్ల నుంచి షాహిద్ మహమూద్ లష్కరే తోయిబా సంస్థలో పనిచేస్తున్నాడు. 2007లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో జాయిన్ అయి సీనియర్ సభ్యుడి స్థాయికి ఎదిగాడు. 2015 నుంచి 2016 వరకు ఈ ఉగ్రవాద సంస్థకు వైస్ చైర్మన్గా పనిచేశాడు. పాకిస్థాన్ను కేంద్రంగా చేసుకొని గాజా, టర్కీ, సిరియా, బంగ్లదేశ్లోని ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూర్చాడు.