EPAPER
Kirrak Couples Episode 1

China : భయంకరమైన వైరస్ పై చైనా ప్రయోగాలు..? మరణాల రేటు 100 శాతమే..!

China : కరోనా వైరస్‌ జాతికి చెందిన ఓ ప్రమాదకర ఉపరకంపై చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్‌ వల్ల మరణాల రేటు 100 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి పుట్టుక రహస్యం ఇప్పటికీ వీడనేలేదు. ఈ వైరస్‌ను చైనానే సృష్టించిందని ప్రపంచ దేశాలు ఆరోపించాయి. ప్రపంచదేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలని చైనా భావించిందనే విశ్లేషణలు వ్యక్తమయ్యాయి.

China : భయంకరమైన వైరస్ పై చైనా ప్రయోగాలు..? మరణాల రేటు 100 శాతమే..!

China : కరోనా వైరస్‌ జాతికి చెందిన ఓ ప్రమాదకర ఉపరకంపై చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్‌ వల్ల మరణాల రేటు 100 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి పుట్టుక రహస్యం ఇప్పటికీ వీడనేలేదు. ఈ వైరస్‌ను చైనానే సృష్టించిందని ప్రపంచ దేశాలు ఆరోపించాయి. ప్రపంచదేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలని చైనా భావించిందనే విశ్లేషణలూ వ్యక్తమయ్యాయి.


డ్రాగన్‌ మాత్రం వీటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉంది. ఏదేమైనా కోవిడ్ భయాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కుదుటపడుతోంది. ఈ క్రమంలోనే మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. బీజింగ్ లో కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్‌పై ప్రయోగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయంగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దాని వల్ల మరణాల రేటు 100 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వుహాన్ లో జరిపిన ఓ అధ్యయనంలో ఈ భయంకరమైన విషయాలు బయటపడినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. ఆ అధ్యయన వివరాల ప్రకారం.. SARS-CoV-2కు చెందిన GX_P2V అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది 2017లో వెలుగుచూసిన జీఎక్స్‌ ఉత్పరివర్తనంగా తెలుస్తోంది. గతంలో దీన్ని మలేషియన్‌ పాంగోలిన్స్‌ జంతువుల్లో గుర్తించారు.


మొదటగా శాస్త్రవవేత్తలు GX_P2V మ్యుటేటెడ్ వెర్షన్‌ను ఎలుకలపై ప్రయోగించారట. వాటిపై ఈ వైరస్‌ తీవ్ర ప్రభావం చూపించిందని వెల్లడించింది. ఎనిమిది రోజుల్లోనే ఎలుకలన్నీ మరణించాయని అధ్యయనం పేర్కొన్నది. దీని కారణంగా ఎలుకల ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్లు, మెదడు దెబ్బతిన్నాయని తెలిపింది. బరువు తగ్గి బలహీనంగా మారాయని, కొన్ని రోజుల్లోనే కనీసం నడవలేని స్థితికి వాటి ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ వైరస్‌ చాలా ప్రమాదకరమైందని అధ్యయనం పేర్కొంది.

ఇది మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై స్పష్టత లేనప్పటికీ.. దాదాపు ఇలాంటి లక్షణాలే ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ‘‘GX_P2V వైరస్‌తో మనుషులకు పెను ముప్పు వాటిల్లనుందని అర్థమవుతోందని అధ్యయనకారులు పేర్కొన్నారు. దీంతో డ్రాగన్‌ ప్రయోగాలు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. కాగా.. తాజా ప్రయోగాలతో వుహాన్‌ ల్యాబ్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. వుహాన్ నుంచే కరోనా వైరస్‌ లీక్‌ అయ్యిందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే.

Tags

Related News

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Israel vs Iran War: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Big Stories

×