EPAPER

Pakistan Bus Accident, 28 people dead: పాక్‌లో దారుణమైన యాక్సిడెంట్, 28 మంది మృతి

Pakistan Bus Accident, 28 people dead: పాక్‌లో దారుణమైన యాక్సిడెంట్, 28 మంది మృతి

Pakistan Bus Accident, 28 people dead: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడిన ఘటనలో 28 మంది మృతి చెందగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందినవారి దేహాలు అక్కడే పడి ఉన్నాయి.


బలూచిస్థాన్ ప్రావిన్స్‌ వద్ద భారీ లోయలో పడిపోయింది బస్సు. టుర్బాట్ నుంచి క్వెట్టాకు బస్సు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమని అంచనా వేస్తున్నారు అధికారులు. చనిపోయినవారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్య్కూ టీమ్ సిబ్బంది ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు అతి వేగంగా వెళ్తున్న సమయంలో టైరు పంక్ఛర్ కావడంతో ఘటన జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.


 

Tags

Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×